కాషాయం త్యాగానికే గానీ కక్షకు సంకేతం కారాదు

కాషాయం త్యాగానికే గానీ కక్షకు సంకేతం కారాదు

న్యూ ఢిల్లీ : ‘యోగి ఆదిత్యనాథ్ కేవలం కాషాయ దుస్తులు వేసుకోగానే సరిపోదు. వాటికి తగినట్లు ప్రవర్తించాల’ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా శనివారం చేసిన ట్వీట్లో హితవు పలికారు. కాషాయ రంగు ఎక్కడా హింసను, అధికార దుర్వినియోగాన్నీ ప్రోత్సహించదన్నారు. నిజమైన హిందువు కాషాయం వేసుకునే అవసరం లేదు. కానీ ఆయా ధర్మాలను పాటించాలి. కాషాయం వేసుకొని హిందూమతాన్ని ముక్కలు చేయడం సరికాదు. కాషాయం ఎప్పుడూ త్యాగాన్నే ప్రబోధిస్తుంది. ఈ విషయాన్ని యోగి అర్థం చేసుకోవాల’ని హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos