పొలుసులు మా కాళ్లు పట్టుకున్నారు..

పొలుసులు మా కాళ్లు పట్టుకున్నారు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నేతల అహంకార వ్యాఖ్యలు,చర్యలకు హద్దు లేకుండా పోతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.వైసీపీ నేతలు సైతం విమర్శలకు బలం చేకూర్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గురజాలను ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికపరంగా ముందుకు వెళ్తున్నట్లు మహేష్ రెడ్డి పేర్కొన్నారు.అభివృద్ధికి సంబంధించి చర్చకు సిద్ధమా అంటూ…మాజీ ఎమ్మెల్యే యరపతినేనికి సవాల్ విసిరారు. తమ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు.అనంతరం పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మహేష్ రెడ్డి. గతంలో పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని…తీరా అధికారంలోకి వచ్చాక కాళ్లు పట్టుకుంటే క్షమించి వదిలేశామని ఆయన అన్నారు.గతంలో తమపై తప్పుడు కేసుల పెట్టారని…తీరా అధికారంలోకి వచ్చాక కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos