ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటాం

ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటాం

అమరావతి : తెదేపా అధినేత చంద్రబాబుపై వైకాపా నేతలు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు సభను అవమా నిస్తూ ఆనందించే స్థాయికి దిగజారారని ఆగ్రహించారు. అసభ్య పదజాలంతో సమావేశాలను దూషణ పర్వంగా మార్చారని విమర్శించారు. సభలో లేనివాళ్ల గురించి మాట్లా డకూడదన్న మర్యాదను విస్మరించారని మండి పడ్డారు. సభను నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతుండడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని, ప్రజల తరఫున పోరాడుతామని అన్నారు. తప్పు చేశామని గ్రహించే స్థితిలో అధికార పక్షం లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos