సైనికాధికారి రాసలీల

సైనికాధికారి రాసలీల

న్యూ ఢిల్లీ : పంజాబ్, అబోహర్ పదాతిదళ ఆర్మీ మాజీ కల్నల్ తన కార్యాలయంలో ఒక ఉద్యోగినితో జరిపిన రాసలీలల్ని ఇద్దరు పదాతి దళ జవాన్లు వీడియో చిత్రీకరించి సాక్షాత్తూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఫిర్యాదు చేసారు. దీంతో దర్యాప్తు మొదలైంది. కల్నల్ చేసిన పనులను బహిర్గతం చేస్తే తమ పైనే చర్యలు తీసుకుంటారనే భయంతో తాము ఫిర్యాదు చేయలేదని ఆర్మీకి చందిన రాజ్‌పుతానా రైఫిల్స్ సైనికులు 25 మంది కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రికి లేఖ రాశారు. కల్నల్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఇలా ఫిర్యాదు చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos