హోసూరు : పట్టణంలోని ఓ మహిళ కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. బాగలూరు రోడ్డు మిలత్ నగర్కు చెందిన జాఫర్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నాడు.ఇతని భార్య జెరినా (25). వీరికి నలుగురు పిల్లలున్నారు. జరీనా శుక్రవారం తన ఇంటి నుంచి మంటల్లో కాలుతూ రోడ్డుపై పరుగులు తీసింది. స్థానికులు ఆమెను మంటల నుంచి కాపాడి హోసూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై హోసూరు హడ్కో పోలీసులు విచారణ చేపట్టారు. కుటుంబ కలహాలతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని జరీనా నిప్పంటించుకొన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది.