సెయింట్ లూసియా : విండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ క్రిస్ గేల్ మళ్లీ చెలరేగాడు. ఇంగ్లండ్తో ఇక్కడ జరిగిన అయిదు, ఆఖరి వన్డేలో 27 బంతుల్లోనే 77 పరుగులు (అయిదు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు) చేయడం ద్వారా ఆ జట్టుకు చుక్కలు చూపించాడు. తొలుత బ్యాట్ చేసిన ఇంగ్లండ్ పేస్ బౌలర్ ఒషాన్ థామస్ ధాటికి 113 పరుగులకే కుప్పకూలింది. తర్వాత విండీస్ కేవలం 12.1 ఓవర్లలోనే మూడు వికెట్ల నష్టానికి విజయ లక్ష్యాన్ని పూర్తి చేసింది. గేల్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది. అయిదు వన్డేల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. మూడో వన్డే రద్దయింది. బుధవారం నుంచి ఈ రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచుల సిరీస్ ప్రారంభమవుతుంది.