బార్బడాస్ : విండీస్తో జరిగిన తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని
ఛేదించి అలవోకగా విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్ రెండో వన్డేలో చతికిలపడింది.
దీంతో అయిదు మ్యాచుల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమ ఉజ్జీలుగా నిలిచాయి. తొలుత బ్యాట్
చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. గేల్
(50), హెట్మెయిర్ (105 నాటౌట్)తో మెరుపులు మెరిపించారు. లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్
47.4 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. మోర్గాన్ (70), బెన్ స్టోక్స్ (79) పరుగులు
చేశారు. విండీస్ జట్టులో షెల్డాన్ కెట్రాల్ అయిదు, కెప్టెన్ జేసన్ హోల్టర్ మూడు
వికెట్లు తీయడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.