వితంతు వింత వివాహం

వితంతు వింత వివాహం

కోరాపుట్: ఒడిశాలో ఓ వింత వివాహం జరిగింది. ‘చనిపోయిన’ వ్యక్తిని వితంతువు కుటుంబ సభ్యుల మధ్య సంప్రదాయ బద్దంగా వివాహ మాడింది . పొడపాడర్ గ్రామ వాసి ఘాసీ అమనాత్య రెండు సంవత్సరాల కిందల కొందరు గ్రామస్థులతో కలిసి ఉపాధి కోసం ఆంధ్రప్రదేశ్ వెళ్లాడు. మార్గ మధ్యంలోనే తప్పిపోయాడు. స్నేహితులు ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీంతో ఎనిమిది నెలల తర్వాత ఘాసీ మరణించాడని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో ఘాసీకి బంధువులు, కుటుంబ సభ్యులు అతడికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అప్పటి నుంచి అతడి భార్య సుబర్న వింతతువుగా జీవిస్తోంది. కానీ రెండు నెలల కిందట ఘాసీ ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆశ్చర్య పోయారు. తప్పి పోయి తిరిగి వచ్చిన విషయాన్ని గ్రామస్థులకు వివరించాడు ఘాసీ. సుబర్న వితంతువుగా మారినందున.. ఆమెను తిరిగి ప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో శివాలయంలో దంపతులు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos