ఎంతైనా మోదీది వాట్సప్ యూనివర్సిటీ కదా

న్యూ ఢిల్లీ:జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ధ్వజ మెత్తిం ది. ‘మోదీ ఎప్పుడూ వాస్తవాలు మాట్లాడరు. ఎంతైనా ఆయన వాట్సప్ యూనివర్సిటీ డిగ్రీ హోల్డర్ అంటూ ఎ ద్దేవా చేశారు. జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తే దేశంలో భూకంపం వచ్చి కశ్మీర్ విడి పోతుందని ఫరూక్ అబ్దుల్లా ఓ సందర్భంలో పేర్కొన్నట్లు మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారని గురువారం లోక్స భలో నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఇది అవాస్తవమని, ప్రధాని దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ బదులి చ్చింది. ‘సెటైరికల్ వెబ్సైట్’లో వచ్చే వార్తలను ప్రధాని ఊటంకిస్తున్నారు. వాస్తవానికి ఇవి తప్పుడు వార్తలు (ఫేక్ న్యూస్). ఎంతైనా వారిది వాట్సప్ యూనివర్సిటీ డిగ్రీ కదా.ఇలాగే ఉంటుంద’ని ఎగతాళి చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos