విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ
(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీ, కేఎల్. రాహుల్, కేదార్
జాదవ్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా,
మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, చాహల్.
ముంబై : ప్రపంచ క్రికెట్ కప్పులో పాల్గొనే టీమిండియా జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. వచ్చే నెలాఖరు నుంచి ఇంగ్లండ్లో ప్రపంచ కప్ టోర్నీ జరుగనుంది. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ ముంబైలో సమావేశం కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యాడు. 15 మందితో కూడిన జట్టును ప్రసాద్ ప్రకటించారు. రిషభ్ పంత్, అంబటి రాయుడులకు మొండి చేయి ఎదురైంది. జట్టులో అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ఇద్దరు స్పెష్టలిస్ట్ స్పిన్నర్లు, ముగ్గురు ఆల్రౌండర్లు ఉన్నారు. మే 30 నుంచి జులై 14 వరకు ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది.