భారత్‌కే ప్రపంచ కప్పు

భారత్‌కే ప్రపంచ కప్పు

ముంబై : క్రికెట్‌ ప్రపంచ కప్పును ఈసారి భారత్‌ సొంతం చేసుకుంటుందని బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ జోస్యం చెప్పాడు. ముంబైలోని ఎంఐజీ మైదానంలో తన పేరిట వెలసిన పెవిలియన్‌ ఎండ్‌ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడాడు. మే 30 నుంచి ప్రపంచ కప్పు పోటీలు జరుగుతాయని, ఎండల కారణంగా పిచ్‌లు ఫ్లాట్‌గా మారుతూ ఉంటాయని తెలిపాడు. అలాంటి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయన్నాడు. భారత బ్యాట్స్‌మెన్‌ మంచి ఫామ్‌లో ఉన్నందున, కప్పు గెలవడానికి అనుకూలించే అంశమని వివరణ ఇచ్చాడు. ఇంగ్లాండ్‌ వాతావరణంలో ఏవైనా భారీ మార్పులు చోటు చేసుకుంటే తప్ప పిచ్‌లపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నాడు. ఐపీఎల్‌లో ఆడిన అనుభవం కూడా భారత జట్టులోని సభ్యులకు ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos