ఢిల్లీ : ఇంగ్లండ్లో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న క్రికెట్ మ్యాచులను వీక్షించడానికి భారత్ నుంచి అత్యధిక సంఖ్యలో అభిమానులు తరలి వెళ్లనున్నారు. పలు కార్పొరేట్ సంస్థలు కూడా ప్రయాణ ఏర్పాట్లలో ఉన్నాయి. నెలన్నర పాటు టోర్నీ జరుగనుండగా, భారత్ ఆడే మ్యాచులను తిలకించడానికి సుమారు ఎనభై వేల మంది అభిమానులు తరలి వెళ్లనున్నారని వివిధ ట్రావెల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. జూన్ 5న భారత్ తొలి మ్యాచ్ అడనుంది. జూన్ 16న ఓల్డ్ట్రాఫోర్డ్లో భారత్ తన దాయాది పాక్తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచును అత్యధిక సంఖ్యలో భారత అభిమానులు తిలకించనున్నారు. తర్వాత జులై 14న జరిగే ఫైనల్స్కు అత్యధిక సంఖ్యలో క్రికెట్ అభిమానులు హాజరు కానున్నారు.