అక్రమ నివాసుల్ని పంపేస్తాం

అక్రమ నివాసుల్ని  పంపేస్తాం

న్యూఢిల్లీ: త్వరలోనే పశ్చిమబంగలో జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ) అమలు చేసి అక్రమ నివాసుల్ని బయటకు పంపేస్తామని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యా, బంగ్లాదేశ్ ముస్లింలకు రక్షణ కల్పిస్తోందని ఆరోపిం చారు. త్వరలోనే వారిని రాష్ట్రం నుంచి పంపిస్తామన్నారు. అస్సాం లో ప్రభుత్వం విడుదల చేసిన ఎన్ఆర్సీ తుది జాబితాలో దాదాపు 19 లక్షల మందికి స్థానం దక్కలేదు.ఇందుకు నిరసనగా బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos