కోల్కతా: పశ్చిమ బంగ భాజపా అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు దిలీప్ ఘోష్ పై కొందరు దుండగులు శుక్ర వారం దాడి చేసారు.ఇక్కడి లేక్ టౌన్ ప్రాంతంలో ఉదయం వాహ్యాళికి వెళ్లినపుడు ఆయన్ను చుట్టు ముట్టిన దుండగులు దాడికి పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన భాజపా కార్యకర్తలు ఆయన్ను అక్కడి నుంచి తరలించారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే ఈ దాడి చేసి ఉంటారని భాజపా సందేహించారు. పోలీసులు దర్యాప్తు ప్రారం భిం చారు. రెండు రోజుల కిందట తూర్పు మిద్నాపూర్లో పర్యటించిన ఘోష్ టీఎంసీ శ్రేణులపై దాడులు చేయాలపి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. టీఎం సీ కార్యకర్తలపై దాడి చేస్తున్నపుడు పోలీసులు అడ్డుపడితే వారిపైనా దాడి చేయాలని సూచించారు.