అధికార్ల తాత్సారానికి బాలుడు బలి

అధికార్ల తాత్సారానికి బాలుడు బలి

హోసూరు: తళి అటవీ ప్రాంతంలోని మల్లహళ్లిలో మంగళవారం రాత్రి ఇంటి గోడ కూలి అజిత్ కుమార్( 2) బాలుడు మృతి చెందినట్లు అధికార్లు ఇక్కడ  తెలిపారు. మృతుడి తల్లి దండ్రులు ప్రాణాలతో బయట పడ్డారు. రంగనాథ అనే గిరిజనుడు తన భార్య కుమారుడితో ఇంటి వెలుపల నిద్రిస్తు న్నపుడు అర్ధరాత్రి ఇంటి గోడ కూలింది. రంగనాథ్, అతని భార్య ప్రాణాలతో బయటపడ్డారు. మల్లహళ్లి గ్రామం అటవి ప్రాంతంలో ఉంది. అక్కడ సుమా రు యాభై కుటుంబాలు నివసిస్తున్నాయి. వారికి ప్రభుత్వం 2004లో ఇళ్లు నిర్మించి ఇచ్చింది. అవిప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరమ్మ తులు చేపట్టాలని అధికారులకు ఎన్నిమార్లు కోరినా పట్టించుకోవటం లేదు. దీంతో ఇలాంటి పరిస్థితి దాపురించిందని గిరిజనులు ఆకోశించారు. ఇక నైనా అధికారులు మరిందరి ప్రాణాలు పోకముందే ముందే ఇళ్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos