పాక్‌ది నీచ కృత్యం

పాక్‌ది నీచ కృత్యం

న్యూ ఢిల్లీ: పాక్ ఐరాసకు చేసిన ఫిర్యాదులో తమ అగ్రనేత రాహుల్ గాంధీని లాగటం నీచ కృత్యంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం ఇక్కడ అభివర్ణించింది. జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. దీనిపై ప్రపంచంలో ఎవరికీ అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సూర్జేవాలా బుధవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. కశ్మీర్ లోయలో పాక్ హింసను ప్రోత్స హి స్తోందని తేల్చి చెప్పారు. కశ్మీర్పై పిచ్చి ప్రేలాపనలు మాని, గిల్గిట్ బలూచిస్థాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచానికి పాక్ వివరణ ఇవ్వాలని డిమాండు చేసారు. మైనారిటీలపై జరుగుతున్న ఆకృత్యాల కూ పాక్ సంజాయిషీ ఇవ్వాలన్నారు. 2018లో జరిగిన 128మంది అమాయకుల నర మేధాన్ని మొత్తం ప్రపంచం వీక్షించిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా దాని మూలాలు పాక్లో తేలుతున్నాయన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos