శ్రీనగర్: కేశ్వాన్ నుంచి కిష్త్వార్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 31 మంది ప్రయాణికులు అక్కడి కక్కడే మరణించారు. పదమూడు మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ప్రమాదం సంభవించినపుడు బస్సులో దాదాపు 45 మంది ప్రయాణికులు ఉన్నారు. పోలీసులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇప్పటివరకు 20 మృతదేహాలను వెలికితీశామని జమ్మూ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ ఎంకే సిన్హా తెలిపారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఘటనపై జమ్మూ-కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.