వివేకా హ‌త్య కేసు నిందితుల‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూ ఢిల్లీ : వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న వారికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదరైంది. ఈ కేసులో కీలక నిందితులు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డిలు దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. అప్రూవర్గా మారిన డ్రైవర్ దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది. క్షమాభిక్ష రద్దు చేయాలని కోరే హక్కు సహ నిందితులకు లేదని తేల్చి చెప్పింది. దస్తగిరికి క్షమాభిక్ష ను సవాల్ చేస్తూ కే శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు జిల్లా, హైకోర్టల్లో దాఖలు చేసిన వ్యాజ్యమూ తిరస్కరణకు గురైంది. దీంతో శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos