అనంతపురం:తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ సమాచారాన్ని వినియోగించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భాజపా నేత నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండు చేసారు. బుధవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ విషయంలో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వ సమాచార చోరీకి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.