విజయవాడ: వచ్చే జనవరి 1 నుంచి గ్రామ సచివాలయాల్లోనే అన్ని సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఇక్కడ గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉద్యోగ నియామక పత్రాలు వితరణ చేసిన తర్వాత ప్రసంగించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని సూచించారు. అత్యంత తక్కువ వ్యవధిలో పారదర్శకంగా గ్రామ సచివాలయ పరీక్షలు నిర్వహించామన్నారు. వచ్చే నవంబరులో ప్రతి గ్రామ వాలంటీర్ కు ఓ స్మార్ట్ ఫోన్ ఇస్తామని తెలిపారు. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ సేవలందిస్తారని వివరించారు.