న్యూ ఢిల్లీ : కరోనా కట్టడిలో కేంద్రం విఫలమైనందునే రెండో దశ వ్యాప్తికి కారణమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ శనివారం ట్విట్టర్లో విమర్శించారు. ‘కేంద్రం ప్రవేశ పెట్టిన విఫల విధానాలే కరోనా రెండో దశ వ్యాప్తికి, వలస కూలీల సొంతూళ్లకు బయలుదేరడానికి కారణ మ య్యా యి. టీకాల్ని విస్తృతంగా వేసి, వలస కార్మికులకు ఆర్థిక సాయం అందిం చాలి. దాని ద్వారానే దేశం ఆర్థికంగా కోలుకుంటుంది. కానీ ఈ స్వార్థ పూరిత ప్రభుత్వం ఈ సూచనలను లెక్కచేయదు’ అని దుయ్యబట్టారు.