ఢిల్లీ : భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ అప్పడప్పుడు తన ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతుంటాడు. కొన్ని వైరల్ కూడా అవుతుంటాయి. ఇలాంటిదే ఒకటి బయటకు రావడంతో అభిమానులు అతనిని ఓ ఆట ఆడుకున్నారు. విండీస్ పర్యటనను విజయవంతంగా ముగించిన విరాట్ కరేబియన్ దీవుల్లో సేద తీరాడు. అయితే ఉన్నట్లుండి అతను తత్వవేత్తగా మారిపోయాడు. ఆసాంతం కాకుండా…కాసింతగా యోగి వేమన గెటప్లో ఉన్న ఫొటోను విరాట్ తన ట్విట్టర్లో షేర్ చేశాడు. మనకున్న పరిమితుల్లో మనం బతకగలిగితే, ఇతరత్రా ఏదీ ఆశించనవసరం ఉండదు…అంటూ ఓ తాత్విక సందేశాన్నిచ్చాడు. అంతే ఇక అభిమానులు, నెటిజన్లు అతనిపై వ్యంగ్యాస్త్రాలు విసరడం మొదలెట్టారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని…ఏం బాబూ ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయావా అని ఒకరు…ట్రాఫిక్ చలాన్లు కట్టిన తర్వాత విరాట్ పరిస్థితి ఇదీ…అంటూ మరొకరు సెటైర్లు విసిరారు.