హింస.. భాజపా లక్షణం

హింస.. భాజపా లక్షణం

అమరావతి: కోల్కతాలో మంగళవారం సాయంత్రం జరిగిన హింసాకాండ భాజపా అసలు రంగుకు అద్దం పట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ట్విట్టర్లో ఈసడించారు. దాడుల్ని అందరూ ఖండించాలని పిలుపు నిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమన్నారు. ఇప్పటికే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో బెంగాల్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మోదీ, అమిత్షా చేస్తోన్న విధ్వంసక వ్యూహాలను ఎదుర్కొనేందుకు దేశంలోని విపక్షాలన్నీ ఏకం కావాల్సి ఉందన్నారు.బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సంఘీ భావాన్ని ప్రకటించారు. అమిత్ షా చర్యలను ఖండించినట్లు ట్విటర్లో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos