ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌మాల్యా

ఏ క్షణమైనా భారత్‌కు విజయ్‌మాల్యా

న్యూ ఢిల్లీ: ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను ఏ క్షణమైనా దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తనను భారత్కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ‘వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్కు తరలించవచ్చు.’అని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి వెల్లడించారు.‘విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం..’ అని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos