న్యూ ఢిల్లీ: ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాను ఏ క్షణమైనా దేశానికి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తనను భారత్కు అప్పగించాలన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా గత నెల 24న యూకే సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ‘వచ్చే కొద్ది రోజుల్లో ఏ క్షణమైనా మేము మాల్యాని భారత్కు తరలించవచ్చు.’అని కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారి వెల్లడించారు.‘విజయ్ మాల్యా యూకే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన తరలింపునకు సంబంధించిన న్యాయప్రక్రియ అంతా పూర్తి చేశాం..’ అని పేర్కొన్నారు.