నౌకాదళంలో కలకలం..

భారత నౌకాదళంలో కలకలం చెలరేగింది. పాకిస్థాన్ తో సంబంధాలు కొనసాగిస్తోన్న ఆరోపణలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టయ్యారు. నావికాదళ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాల సంయుక్త ఆపరేషన్ లో పలు కీలక విషయాలు బయటపడ్డాయి. తూర్పు నౌకాదళ కమాండ్ కు కీలకమైన డాల్ఫిన్స్ నోస్ కేంద్రంగా గూఢచర్య రాకెట్ కొనసాగుతోందని గుర్తించిన అధికారులు ఇందులో సంబంధమున్న వారిని పక్కా ప్రణాళికతో అరెస్టు చేశారు.గూఢచర్యం వ్యవహారం కేసులో ఏడుగురు నౌకాదళ సిబ్బందిని విశాఖపట్నం పోలీసులు అరెస్టు చేసి విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు. మరోవైపు హవాలా ఆపరేటర్ ను కూడా ఇంటెలిజన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos