అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అన్నా క్యాంటీన్లు మూసివేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది.అతి తక్కువ ధరలకే భోజనం అందిస్తున్న అన్నా క్యాంటీన్లను మూసివేయడంతో క్యాంటీన్లలో పని చేసే కార్మికులు ఉపాధి కోల్పోగా పేద ప్రజలు,కార్మికులు తక్కువ ధరకు భోజనం లభించక ఇబ్బందులు పడుతున్నారన్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి సంయుక్త కార్యదర్శి రవికాంత్ ఆరోపించారు.పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వంపై ఉన్న కక్షతో మూసివేయడం సమంజసం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఈ సందర్భంగా వారు మానవ హక్కుల కమిషన్ ని కోరారు..