ప్రజా విప్లవం వెల్లు వెత్తుతుంది

ప్రజా విప్లవం వెల్లు వెత్తుతుంది

హిందూపురం: త్వరలోనే ప్రజా విప్లవం వెల్లు వెత్తుతుందని నటుడు నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ‘గతంలో రాజధానిగా అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి ఇప్పుడు ప్రజల్లో లేనిపోని చీలి కలు తెస్తున్నారు. ఒక వెలుగు వెలిగిన తెలుగు చరిత్ర ఇప్పుడెక్కడికి పోతోంది? పొరుగు రాష్ట్రాల స్థాయికి చేరుకోవాలంటే హైద రా బాద్, బెంగళూరు, చెన్నైకి దీటుగా అద్భుతమైన రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరముంది. ఆర్థిక రాజధాని విశాఖ అని ఎప్పుడూ అంటూనే ఉన్నాం. శాసన, కార్యనిర్వాహక శాఖలు ఎక్కడైనా ఒకచోటే ఉండాలి. కర్నూలు నుంచి విశాఖ వెళ్లా లం టే ఎంతో దూరమవుతుంది. కియా అనుబంధ సంస్థలు వెనక్కి వెళుతు న్నాయ’ని పేర్కొన్నారు. హిందూపురంలో వైకాపా కార్యకర్తలు తన వాహనాల్ని అడ్డుకుని కొత్త సంస్కృతికి తెరలేపారని ఆగ్రహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos