వేణు మాధవ్‌ కన్నుమూత..

  • In Film
  • September 25, 2019
  • 126 Views
వేణు మాధవ్‌ కన్నుమూత..

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు.కొద్ది రోజులుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వేణుమాధవ్‌ పరిస్థితి మంగళవారం విషమించడంతో సికింద్రాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో చేర్పించారు.అప్పటి నుంచి వేణుమాధవ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా బుధవారం మధ్యాహ్నం చికిత్స ఫలించక మృతి చెందారు.1979లో సూర్య పేట్ జిల్లాలో కోదాడ మండలంలో జన్మించిన వేణుమాధవ్‌ మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన ‘సంప్రదాయం’ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన వేణుమాధవ్. ‘తొలిప్రేమ’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇప్పటి వరకు సుమారు 171 చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.వేణుమాధవ్‌ మృతి వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది.సినీ ప్రముఖులు వేణుమాధవ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos