హైదరాబాద్ : నిరంతరం కొత్త విషయాన్ని నేర్చుకుంటూ, సమస్యలను అధిగమించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్ పరిశోధన సంస్థ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తూనే వ్యవసాయ రంగంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని, కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కూడా కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యం, భూగర్భంలోని ఖనిజాల గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.