కూర‘గాయాలు’..

కూర‘గాయాలు’..

ప్రజల్లో నెలకొన్న కరోనా భయాన్ని తెలంగాణలో కూరగాయల వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో తెలంగాణలో లాక్డౌన్ప్రకటించిన నేపథ్యంలో ధరలు పెరిగిపోతాయన్న అపోహ ప్రజల్లో నెలకొంది. దీంతో అత్యాశతో వెంటనే మార్కెట్లలోకి వెళ్లి నిత్యావసర సరుకులు కొనుక్కుంటున్నారు.ప్రజల హడావుడే ఆసరాగా వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు.కూరగాయల ధరలను అమాంతం పెంచేశారు. వీటిపై అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్‌, మోహదీ పట్నం రైతు బజార్ల్లో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కిలో టమాటా ధర నిన్నటి వరకు రూ. 8గా ఉండగా  రోజు వ్యాపారులు కిలో రూ.100కి అమ్ముతున్నారు.వంకాయ నిన్నటి వరకు కిలో రూ.15 ఉండగా రోజు రూ. 80కి, మిర్చి కిలో రూ. 25గా ఉండగా ఇప్పుడు రూ. 90కి అమ్ముతున్నారు. అలాగే, అన్ని కూరగాయల ధరలు పెంచేశారు. హైదరాబాద్లోనే కాదు నల్లగొండ, నిజామాబాద్జిల్లాల్లోనే ఇటువంటి పరిస్థితులే వినియోగదారులకు ఎదురవుతున్నాయి. ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos