అమరావతి: రాష్ట్ర రహదారి రవాణా సంస్థ అధ్యక్ష పదవినుంచి నెలరోజుల్లో వైదొలగాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్యకు ప్రభుత్వం శుక్రవారం తాఖీదులు జారీ చేసింది. సంస్థ నిబంధనల ప్రకారం ఛేర్మన్ పదవీ కాలం ఏడాది మాత్రమే. వర్ల రామయ్య పదవీ కాలం ఏప్రిల్ 24, 2019లో ముగి సింది. ఆయన మాత్రం పదవి నుంచి వైదొలగలేదు. దరిమిలా సంస్థ 1950 చట్టం సెక్షన్-8లోని ఉప నిబంధన-2 ప్రకారం రవాణా శాఖ ముఖ్య కార్య దర్శి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణబాబు తాఖీదుల్ని జారీ చేసారు. విజయవాడ జోనల్ చైర్మన్ పార్థసారధికి కూడా ఇదే మాదిరి తాఖీదుల్ని ఇచ్చా రు. కడప జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి రాజీనామాను ఆమోదించింది.