వరవర రావు క్షేమం

వరవర రావు క్షేమం

ముంబై: ప్రధాని నరేందర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణకు గురయిన విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న జేజే ఆస్పత్రి వైద్యులు బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఏ విధమైన విచారణ లేకుండా, న్యాయస్థానంలో అభియోగ పత్రాన్ని కూడా దాఖలు చేయని కేసులో ఆయన్ను గత ఇరవై రెండు మాసాలుగా పాలకులు మహారాష్ట్ర చెరసాల్లో బంధించారు. అనారోగ్యంతో బాధ పడిన ఆయన్ను కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ఒత్తిడికి లొంగిన పాలకులు అనివార్యంగా గత సోమవారం రాత్రి ముంబయిలోని జేజే ఆస్పత్రిలో చేర్చారు. ‘వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. నాడీ విభాగంలో చికిత్స అందిస్తున్నాం. ఆయన ఆరోగ్యాన్ని విశ్లేషించేందుకు కొంత సమయం పడుతుంద’ని ఆస్పత్రి డీన్ డా.రంజిత్ వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos