చెన్నై:తమిళ నాట రాజకీయ శూన్యత లేదని నటుడు సత్యరాజ్ సోమ వారం ఇక్కడ వ్యాఖ్యానించారు. ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్హాసన్ల వల్ల ఏ ప్రయోజనమూ, మార్పు ఉండదని ఘాటుగా స్పందించారు. డీఎంకే వంటి పాతుకుపోయిన పార్టీలను పెకిలించాలని అనుకోవడం మూర్ఖత్వమని ఎద్దేవా చేశారు. రాజకీయాలు చేయటానికి తమిళనాట చాలా మంది ఉన్నారని.. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని చురకలంటించారు.