న్యూ ఢిల్లీ: కరోనా టీకా అందరికీ అవసరమని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్గాంధీ ఉద్ఘాటించారు. సురక్షితమైన జీవితం ప్రతి భారతీయుని హక్కు అని తెలిపారు. “కరోనా టీకా వారికి ఇవ్వాలి, వీరికి ఇవ్వొద్దు అంటూ చర్చలు జరపడం అనవసరం. పూర్తి భద్రతాయుతమైన జీవితం ఉండటం ప్రతి భారతీయుని హక్కు’అని ట్వీట్ చేసారు. ‘ఎవరికైతే అవసరమో వారికే కరోనా టీకా ఇస్తాం. కావాలి అనుకునేవారికి టీకా ఇవ్వము” అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటనకు రాహుల్ ఈ మేరకు స్పందించారు.