V చిత్రం పవన్ – మహేశ్‌తో అనుకున్నారట..

  • In Film
  • March 24, 2020
  • 99 Views
V చిత్రం పవన్ – మహేశ్‌తో అనుకున్నారట..

సుధీర్ బాబు తాజా చిత్రంగా రూపొందినవిత్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన సినిమాను గురించి, ‘ఆలీతో సరదాగాకార్యక్రమంలో సుధీర్ బాబు ప్రస్తావించాడు. “నేను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలోసమ్మోహనం‘  సినిమా చేస్తున్నప్పుడు, ఆయన నాకువికథ చెప్పారు. కథ చాలా కొత్తగా .. విభిన్నంగా అనిపించింది.’ఎవరితో చేయాలనుకుంటున్నారు?’ అని  అడిగితే, పవన్మహేశ్ బాబులతో చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. నాతో చేస్తే బాగుండని అప్పుడే అనుకున్నాను. తరువాత కథానాయకుడిగా నానీని అనుకుంటున్నట్టు తెలిసింది. రెండో కథానాయకుడి పాత్ర నా దగ్గరికి వచ్చింది. నేను బలంగా కోరుకున్నాను కనుకనే, కథ నా దగ్గరికి వచ్చింది. సినిమా నాకు తప్పకుండా మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుందిఅని చెప్పాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos