కమలం కంచు కోటలో ఊర్మిళ పోరు

ముంబై : బాలీవుడ్‌నటి ఊర్మిళ మటోండ్కుర్ (45) భాజపాకి కంచు కోట లాంటి ముంబై ఉత్తర లోక్సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సమితి ప్రధాన కార్యదర్శి ఇన్‌చార్జి ముకుల్ వాస్నిక్ శుక్రవారం ఇక్కడ ఈ విషయాన్ని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో గత బుధవారం పార్టీలో ఊర్మిళ చేరారు. చాలా మంది ఊహించినట్లు ఆమె ఎన్నికల బరిలోకి దిగారు. ప్రచారానికి లాంఛనంగా దిగకముందే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ప్రధాని వ్యక్తి గతంగా మంచి వ్యక్తే. ప్రధానిగా ఆయన అనుసరిస్తున్న విధానాలే మంచివి కావ’ని వ్యాఖ్యానించారు. ప్రజా స్వామ్యదేశంలో ప్రజలు ఏం తినాలో, ఏం మాట్లాడాలో నిర్ణయించుకునే హక్కును మోదీ కాల రాశారని విమర్శించారు. కాగా బాల నటిగా మరాఠీ చిత్రంతో సినిమా రంగంలోకి ప్రవేశించిన ఆమెకథానాయికగా పలు హింది,మరాఠీ, దక్షిణాది చిత్రాల్లోనూ నటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos