రాజోలు:నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తెలంగాణ విపక్షాలు, పర్యావరణ వేత్తలు చేపట్టిన ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమం పట్ల ప్రజల్లో జన సైనికులు అవగాహన కల్పించాలని రాజోలు జనసేన శాసనసభ్యుడు రాపాక వర ప్రసాద్ శుక్రవారం ట్విట్టర్లో విన్నవించారు. ఇందు కోసం సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్(డీపీ)లను సేవ్ నల్లమల గా మార్చుకోవాలని పిలుపు నిచ్చారు.