అమరావతి: శాసన మండలి రద్దు ముసాయిదాను సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రవేశపెట్టారు. దీని గురించి చర్చ మొద లైంది. కొన్ని రోజులుగా శాసనమండలిలో జరిగిన పరిణామాలు బాగోలేవని ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత ప్రయోజనాలపైనే దృష్టి పెట్టి ఉభయ సభల్లో అసెంబ్లీ, తెదేపా నేతలు గందరగోళాన్ని సృష్టిస్తు న్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాల వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆరో పించారు.