హాథ్రస్ బాధిత కుటుంబం వేసిన పిటిషన్ తిరస్కరణ

హాథ్రస్ బాధిత కుటుంబం వేసిన పిటిషన్ తిరస్కరణ

లఖ్ నవూ : హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని జిల్లా అధికారులు అక్రమంగా నిర్బంధించినట్లు దాఖలైన వ్యాజ్యాన్ని అలహాబాద్ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కుటుంబ సభ్యులను 24 గంటల్లోగా కోర్టులో హాజరుపరచాలని కోరుతూ వేసిన హెబియస్ కార్పస్ వ్యాజ్యాన్ని కొట్టి వేసింది. జిల్లా అధికారులు తమను బంధించారని.. స్వేచ్ఛగా తిరగనివ్వట్లేదని ఆరోపిస్తూ అలహాబాద్ కోర్టులో అఖిల భారత వాల్మీకి మహా పంచాయత్ సంఘం జాతీయ కార్యదర్శి సురేందర్ కుమార్ బాధిత కుటుంబం తరఫున ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయ మూర్తులు ప్రకాష్ పాడియా, ప్రితీంకర్ దివాకర్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం దీన్నితిరస్కరించింది. బాధిత కుటుంబానికి రక్షణ కల్పి స్తున్న ప్పుడు ఇలాంటి వ్యాజ్యాలను కోర్టు ప్రోత్సహించదని తేల్చి చెప్పింది. ‘బాధిత కటుంబానికి తమకు కలిగిన అసౌకర్యాలపై వ్యాజ్యాల్ని దాఖలు చేసే స్వేచ్ఛ ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం బాధ్యతగా రక్షణ కల్పిస్తున్నప్పుడు ఇలాంటి వ్యాజ్యాల్ని న్యాయ స్థానం ఎట్టి పరి స్థితుల్లోనూ ప్రోత్సహించద’ని తేల్చి చెప్పింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos