కుప్పం:చిత్తూరు జిల్లా కుప్పం నియోజక వర్గంలోని శాంతి పురంలో మంగళవారం ఉదయం తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య గొడవలు సంభవించాయి. రెండు పార్టీల కార్యకర్తలు బాహా బాహీకి దిగారు. మంగళ, బుధవారాల్లో తెదేపా అధినేత చంద్ర బాబు నాయుడు కుప్పం నియోజక వర్గంలో పర్యటించ నున్నారు. దరిమిలా తెదేపా శ్రేణులు శాంతి పురంలో బ్యానర్లు ఏర్పాటు చేశాయి. వాటిని తొలగించాలని వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. దారి తీసింది. వైకాపా బ్యానర్లను తొలగించి తెదేపా బ్యానర్లు కట్టడమే గొడవకు కారణమని తెలిసింది. దాదాపు మూడు గంటల పాటు రెండు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డు పై బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వారిని చెదరగొట్టారు.