గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవాలు మేలు

గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవాలు మేలు

నెల్లూరు: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించడమే మేలని లోక్సభ సభ్యుడు ఆదాల ప్రభా కర రెడ్డి సూచించారు. బుధవారం ఉప్పుటూరులో నిర్మించనున్న భవంతుల పథకాల భూమి పూజకు శాసన సభ్యుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. 17 గ్రామాల్లో పలు గ్రామాలు ఏకగ్రీవం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. శ్రీధర్ రెడ్డి తో కలిసి ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఉప్పుటూరు వంటి చిన్న పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే ఏకగ్రీవాలు మేలని అభిప్రాయపడ్డారు. ‘తెలుగుదేశం పార్టీ నామమాత్రంగా మారింది. ఎన్నికలకు ముందు కొంతమంది నేతలు, ఆ తర్వాత మిగిలిన నేతలు వైకాపాలోకి వచ్చారు. అందువల్ల తెలుగు దేశం పార్టీ నామమాత్రం అయిపోయింద’ని వ్యాఖ్యానించారు. తమ నియోజక వర్గ పరిధిలోని అన్ని గ్రామాలకూ అన్ని సౌక ర్యాలు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. రానున్న మూడేళ్లలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు పూర్తయి నిధులు మిగిలిపోతాయని పేర్కొన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు ఆనం విజయకుమార్రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి,రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి గిరిధర్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు, నవీన్ కుమార్ రెడ్డి , సుధాకర్ రెడ్డి, కోడూరు కమలాకర్రెడ్డి, అబూబకర్, యేసు నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానికులు నేతలందరినీ ఘనంగా సన్మానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos