బీజింగ్: జమ్ము-కశ్మీర్కున్న ప్రత్యేక ప్రతిపత్తి రద్దు గురించి చర్చించడానికి వీలైనంత త్వరగా ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలని చైనా కూడా కోరింది. ‘‘భద్రతా మండలిలో కశ్మీర్ అంశంపై చర్చలు జరపాలని చైనా కోరింది. పాక్ అభ్యర్థనను ఉటంకిస్తూ వారు లేఖ రాశారు’’ అని ఐరాస రాయబారి ఒకరు వెల్లడించారు. సమావేశం ఏర్పాటుకు ముందు ఇతర సభ్య దేశాల అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు.