బాలీవుడ్లో
ధూమ్ సిరీస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.క్రేజీ కాంబినేషన్లతో ధూమ్ సిరీస్లు
ప్రేక్షకులను అలరించాయి.ధూమ్ సిరీస్ చిత్రాలతో గుర్తింపు తెచుకున్న ఉదయ్చోప్రా కొద్ది
కాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు.గత ఏడాదిగా ఉదయ్చోప్రా చేస్తున్న
ట్వీట్లు అతడి మానసిక కుంగుబాటును తెలియజేస్తున్నాయి. తాజాగా ఉదయ్చోప్రా చేసిన ట్వీట్లు
బాలీవుడ్ వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి.త్వరలో సామాజిక మాధ్యమాల ఖాతాలను తొలగిస్తున్నా..ఎంత
ప్రయత్నించినా కోలుకోలేకపోతున్నా..మరణానికి దగ్గరగా వెళుతున్నట్లు ఉంది. ఆత్మహత్య చేసుకోవడానికి
ఇదే సరైన సమయమని భావిస్తున్నానంటూ ఉదయ్చోప్రా చేసిన ట్వీట్లు బాలీవుడ్ వర్గాలకు షాక్కు
గురి చేశాయి.బాలీవుడ్ నటీనటుల ద్వారా విషయం తెలుసుకున్న ఉదయ్ కుటుంబ సభ్యులు వెంటనే
ట్వీట్లను తొలగించారు.గత ఏడాది నుంచి ఉదయ్చోప్రా ఇటువంటి వ్యాఖ్యలే చేస్తున్నాడు.ఇండియాలో
డ్రగ్స్ వాడకాన్ని చట్టబద్దం చేయాలని డ్రగ్స్ వాడడం ఆరోగ్యానికి మంచిదని మన సంప్రదాయంలో
డ్రగ్స్ కూడా భాగం కావాలంటూ ఉదయ్చోప్రా చేసిన ట్వీట్లు అప్పట్లో పెను దుమారం రేపాయి.ఈ ట్వీట్లపై ముంబయి పోలీసులు
కూడా చాలా తీవ్రంగా స్పందించగా తన అభిప్రాయాలను చెప్పుకొనే హక్కు తనకు ఉందంటూ సమాధానమిచ్చాడు..