విధులకు వెళుతూ…ఇద్దరి మృతి

విధులకు వెళుతూ…ఇద్దరి మృతి

హోసూరు : స్థానిక పారిశ్రామికవాడలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన స్థానికుల మనసును కలచివేసింది. హోసూరు సమీపంలోని బేగేపల్లి గ్రామానికి చెందిన సెల్వి(45) పారిశ్రామిక వాడలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నది. అదే కంపెనీలో పారిశ్రామిక వాడలోని మూకండపల్లి గ్రామానికి చెందిన ముత్తుపళని కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బుధవారం సెల్వి, ముత్తుపళనిలు ద్విచక్ర వాహనంపై విధులకు వెళుతుండగా, రాజేశ్వరి లేఔట్ సమీపంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి, సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సిప్‌కాట్‌ పోలీసులు శవాలను స్వాధీనపరచుకొని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు దర్యాప్తులో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos