కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మంగళ వారం రెండు వ్యాజ్యాలు కోల్కతా ఉన్నత న్యాయ స్థానంలో దాఖలయ్యాయి. పశ్చిమ బంగలో పౌరసత్వ (సవరణ) చట్టం-2019 అమలు చేయరాదని మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయాన్ని సవీలు చేస్తూ మొదటి వ్యాజ్యం దాఖలైంది. సీఏఏను అమలు చేసేది లేదంటూ ప్రజా ధనంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చినందుకు రెండవ వ్యాజ్యాన్ని దాఖలు చేసారు.కోల్కతా మేయర్ ఫరీద్ హకీంను ముందస్తు నిర్బంధంలోకి తీసుకోవాలనేది మూడో వ్యాజ్యాం సారాంశం. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇది విచారణకు రానుంది.