ఇద్దరు ముష్కరులు హతం

ఇద్దరు ముష్కరులు హతం

జమ్ము: సోపోర్ జిల్లాలోని హర్ద్శివ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హత మయ్యారు. ముష్కర మూకల కోసం గాలింపుల్ని చేపట్టినపుడు తీవ్రవాదులు కాల్పులకు దిగటంతో ఎదురు కాల్పులు అనివార్యమయ్యాయయని అధికార్లు తెలిపారు. బుద్గాం జిల్లా, నర్బల్ ప్రాంతంలో ఐదుగురు ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 28 తూటాళ్ల ఏకే 47, ఒక మ్యాగజైన్, 20 లష్కరేతోయిబా పోస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని ఇమ్రాన్ రషీద్, ఇఫ్షాక్ అహ్మద్ గనీ, ఓవైసీ అహ్మద్, మొహ్సిన్ ఖాదిర్, అబిడ్ రాధర్లుగా గుర్తించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి, అవసరమైన సామగ్రిని చేరవేస్తున్నారని తెలిపారు. యూఏపీఏ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos