ఆప్‌కు ఎస్పీ,బీఎస్పీ మద్ధతు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో న్యూ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ లోక్సభ నియోజక వర్గాల్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్ధులకు మద్దతివ్వాలని ఎస్పీ-బిఎస్పీ నాయక త్వాలు తీర్మానించాయి. మిగతా స్థానాల్లో బీఎస్పీకి మద్దతు ఇవ్వనున్నట్టు సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. బీఎస్పీ అభ్యర్థులు సంజయ్ గెహ్లాట్ (ఈస్ట్ ఢిల్లీ), రాజ్వీర్ సింగ్ (నార్త్ ఈస్ట్ ఢిల్లీ), సీతా శరణ్ (వెస్ట్ ఢిల్లీ), షాహీద్ అలీ (చాందినీ చౌక్), సిద్ధాంత గౌతమ్ (సౌత్ ఢిల్లీ) పోటీ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos