టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్పై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. రెండు టీ20ల సిరిస్లో భాగంగా విశాఖ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి భారత బౌలర్ ఉమేశ్ యాదవే కారణమని అభిమానులు మండిపడుతున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. అనంతరం 127 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు విజయానికి ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ ఆ పరుగులు సమర్పించుకోవడంతో ఆసీస్ విజయం సాధించింది.అంతేకాదు ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన బుమ్రా కష్టాన్ని ఉమేశ్ యాదవ్ బుగ్గిపాలు చేశాడు. 19వ ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి 2 పరుగులు ఇచ్చి మ్యాచ్లో భారత్ ఆశలను సజీవం చేశాడు. ఆఖరి ఓవర్లో 14 పరుగులకు అడ్డుకట్ట వేయలేక పోవడంతో పాటు ఆఖరి బంతికి రెండు పరుగులు కావాల్సి ఉండగా బంతి ఎలా వేయాలో కూడా తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.దీంతో భారత్ ఓటమికి కారణమైన ఉమేశ్ యాదవ్పై నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ్ ట్రోల్ చేస్తున్నారు. టీ20ల్లో.. అది చివరి ఓవర్లలో ఎలా బౌలింగ్ చేయాలో కూడా తెలియదా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.