వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్..

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్..

వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది.ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ తెదేపా ఎమ్మెల్సీ బీటెక్‌ రవి హైకోర్టును ఆశ్రయించారు.సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.వివేకానందరెడ్డి దారుణహత్యకు గురై ఇన్ని నెలలైనా ముఖ్యమంత్రి జగన్‌ కేసు గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు.ఈ కేసు విచారణ విషయంలో ఏపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, అందుకే, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ వేసినట్టు చెప్పారు. అమాయకులకు శిక్ష పడకూడదని పిటిషన్‌తో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఇది తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేని తమను విచారిస్తున్నారని హత్య వెనుక తన ప్రమేయం ఉంటే కనుక ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధమేనని అన్నారు.సీబీఐతో విచారణ జరిపించాలని కోరిన వివేకా కూతురు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.వివేకా హత్య కేసులో బీటెక్‌ రవి సైతం విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos