హైదరాబాద్ : ఫోర్జరీ, డేటా చోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. పోలీసుల నోటీసులకు ఆయన స్పందించడం లేదు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయనతో పాటు నటుడు శివాజీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్తో పాటు విజయవాడ, బెంగళూరులలో ప్రత్యేక బృందాలు గాలింపు జరుపుతున్నాయి. రవి ప్రకాష్కు దాదాపుగా అన్ని దారులు మూసుకుపోయాయి.